VijayaKumar

Apr 11 2024, 18:20

భారతీయ జనతా యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులుగా దంతూరి అరుణ్ కుమార్ నియామకం


భారతీయ జనతా పార్టీ యువ మోర్చా యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యులుగా వలిగొండ మండలం కు చెందిన దంతూరి అరుణ్ కుమార్ ను నియమిస్తూ గురువారం భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రాంతంలో జరుగుతున్న యువత ,ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఉద్యమాలు చేపట్టడం ద్వారా పార్టీని సంస్థాగతంగా పటిష్ట పరిచి విస్తరించడానికి కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ నియామకానికి సహకరించిన వలిగొండ మండల జిల్లా రాష్ట్ర నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

VijayaKumar

Apr 11 2024, 17:51

సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించండి : పాలడుగు భాస్కర్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు

Lll

      భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ప్రశ్నించే గొంతు పోరాడే నాయకుడు సిపిఎం అభ్యర్థి యండి.జహంగీర్ ను ఈ ఎన్నికల్లో గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఎండి. జహంగీర్ ను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భాస్కర్ పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో దేశాన్ని అధోగతి పాలు చేసిందని దేశంలోని ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటర్ శక్తులకు కారు చౌకగా అమ్మతు దేశ ఐక్యతను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. లౌకిక ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో కులము మతము మతోన్మాదము మనువాద సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల మధ్యన ఐక్యతను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. బిజెపి పాలనలో సామాన్య మానవులు నిత్యవసర సరుకులను కొని తినే పరిస్థితుల్లో లేరని అన్ని రకాల నిత్యవసర వస్తువుల ధరలు పెంచడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మరోవైపు దళితుల పైన మహిళల పైన గిరిజనుల పైన దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు పెరిగిపోయాయని రాజ్యాంగంలో ఉన్న పౌరుల హక్కులను మొత్తం దెబ్బతీస్తున్న పరిస్థితి ఉన్నదని మరో మారు ఈ దేశంలో బిజెపి అధికారంలోకి వస్తే ప్రజల బతుకుకు రాజ్యాంగానికి రక్షణ లేదని ఈ ఎన్నికల్లో బిజెపిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలో విఫలమయిందని బిఆర్ఎస్ 10 సంవత్సరాల పాలల్లో ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదని అందుకే ఈ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ టీఆర్ఎస్ ను ఓడించి సిపిఎం గెలిపించాలని ప్రజలను భాస్కరు కోరినారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పగిళ్ల ఆశయ్య , కొండమడుగు నర్సింహ్మ, సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ , సిపిఎం మండల కమిటీ సభ్యులు గునుగుంట్ల శ్రీనివాస్, గ్రామ శాఖ కార్యదర్శి అబ్దుల్లాపురం వెంకటేష్, సభ్యులు బొల్లెపల్లి స్వామి, బొల్లెపల్లి కిషన్, గంగనబోయిన బాల్ నర్సింహ్మ , గంగదార్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

           

VijayaKumar

Apr 11 2024, 15:26

మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ : ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

రంజాన్ పండుగ ను పురస్కరించుకుని ఆలేరు పట్టణంలోని ఈద్గ వద్ద ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు.బీర్ల ఐలయ్య గారితో పాటు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అలాయి బలాయి తీసుకొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య గారు మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అన్నారు.ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో అల్లాహ్ ప్రజలందరి కష్టాల తొలగించి శాంతి సంపద ఆనందం ఆరోగ్యం శ్రేయస్సు ఇవ్వాలని కోరుకున్నారు.రంజాన్ మాసంలో కఠిన ఉపవాస దీక్ష క్రమశిక్షణతో చేసిన ప్రార్థనలు సమత మమత ను పెంచుతాయన్నారు..రంజాన్ పండుగ మనుషుల్లో మానవీయ విలువలను, పరస్పర ప్రేమానురాగాలను పెంపొందిస్తుందన్నారు.సమాజంలో సమానత్వం, సోదరభావాన్ని తెలియజేస్తుందన్నారు. రంజాన్ పండుగ ముఖ్యంగా దాన గుణాన్ని నేర్పుతుందన్నారు.మరోసారి ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

VijayaKumar

Apr 11 2024, 14:58

గూడూరు నారాయణరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం


గూడూరు నారాయణ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈ రోజు గూడూరు టోల్ గేట్ వద్ద చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి మాజి ఎంపీ & భువనగిరి భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు.ఈ కార్యక్రమం లో వారితో పాటు భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ గారు , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి మల్లేష్ గారు, బి జె పి రాష్ట్ర కిసాన్ మోర్చ ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి గారు, గూడూరు నారోత్తం రెడ్డి గారు, బి జె పి బీబీనగర్ మండల అధ్యక్షులు ఇంజమూరి ప్రభాకర్ గారు మాజి అధ్యక్షులు జంగా రెడ్డి గారు మరియు జిల్లా బి జె పి నాయకులు, మండల నాయకులు మరియు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 11 2024, 14:36

వలిగొండ మండల కేంద్రంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు


వలిగొండ మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతినీ ఘనంగా నిర్వహించారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి కృష్ణాఫర్, సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎల్లంకి మహేష్,బి.ఎస్.పి మండల పార్టీ అధ్యక్షులు సుక్క శ్రీకాంత్, జయంతిని పురస్కరించుకొని ఈ సందర్భంగా సంయుక్తంగా మాట్లాడుతూ* జ్యోతీ రావు పూలే సత్యశోధక సమాజం ఏర్పాటు చేయడంతో మహారాష్ట్రలో బ్రాహ్మణేతర ఉద్యమం ఒక నిర్దిష్టమైన రూపాన్ని సంతరించుకున్నది.

 పూలే మాలి కులానికి కూరగాయలు పండించి వ్యాపారం చేసే కులం చెందిన ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. క్రైస్తవ మిషనరీ పాఠశాలలో చదువుకున్నాడు. స్వేచ్ఛా సమానత్వం వంటి పాశ్చ్యాత్య ఆదర్శాలతో ప్రత్యేకించి అమెరికాకు చెందిన టామ్ పెన్ రచనల చేత ఉత్తేజితుడై పూలే సాంఘిక సంస్కరణలు చేపట్టాడు.

 పీష్వా పీడకల పాలనను అంతం చేసిన బ్రిటిష్ పాలకులు పెట్టుబడిదారీ అభివృద్ధిని పాశ్చ్యాత్య ఆలోచనను అన్ని కులాలకు అందించారు.పీడిత ప్రజలలో, బాంబే కార్మిక వర్గంలోనూ, రైతాంగంలోనూ, పూనాలో ఆ చుట్టుపక్కల ఉన్న అంటరానివారిలోనూ పూలే తన కృషిని కేంద్రీకరించాడు.

ఆర్య దురాక్రమణదారులు స్థానిక జాతిపరమైన కుల వ్యవస్థ పుట్టుక సిద్ధాంతాన్ని వ్యాఖ్యానించి, సత్యశోధక్ సమాజ్ రైతాంగంతో సంబంధాలు ఏర్పరుచుకుంది.

సత్యశోధక్ సమాజ్ బ్రాహ్మణ పురోహితులు చేసే పెళ్లి తంతును తిరస్కరించారు. స్త్రీల కోసం పాఠశాలలను,అనాథలైన స్త్రీలకు ఆశ్రమాన్ని కల్పించారు.అంటరాని వారి కోసం పాఠశాలలను ప్రారంభించింది. మంచి నీటి బావులను వారికి అందుబాటులోకి తెచ్చారు. కుల వ్యవస్థను , అంటరానితనం సమూలంగా నిర్మూలించడం కోసం అనేక ఉద్యమాలు చేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు గుండు కృష్ణమూర్తి, బొడిగ సుదర్శన్,వేముల నరేందర్,కొత్త వెంకటేష్, సారయ్య,ఎడవల్లి చందు, ఉదయ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు

VijayaKumar

Apr 11 2024, 11:59

ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాగీరు యాదగిరి గౌడ్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాగీరు యాదగిరి గౌడ్ గురువారం జిల్లా నాయకులు చెరుకు శివయ్య గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు , అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయని అన్నారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సారధ్యంలో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చెరుకు శివయ్య గౌడ్, ఈతాప రాములు, గ్రామస్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 10 2024, 21:21

వలిగొండ లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్స్ లో మైనార్టీ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల రోజులు పవిత్ర రంజాన్ మాసంలో కఠోర దీక్షలు చేసి ,ప్రపంచ మానవాళి సుఖ, సంతోషాల తో ఉండాలని అల్లాహాను ప్రార్ధించిన అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వలిగొండ ఎంపీపీ నూతి రమేష్ రాజ్, ముస్లిం పెద్ద పెద్దలు, యువకులు ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 10 2024, 18:56

సుంకిశాల గ్రామం నుండి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో బీఆరెస్ పార్టీని వీడి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరిన వలిగొండ మండలం సుంకిశాల గ్రామ నాయకులు.

వలిగొండ మండలం సుంకిశాల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ జిల్లా నాయకులు చెరుకు శివయ్య గౌడ్ ఆధ్వర్యంలో బీఆరెస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన మాజీ సర్పంచ్ మొగిలిపాక నరసింహ,ఉప సర్పంచ్ కొండల్ రెడ్డి,మాజీ సర్పంచ్ పోలెపల్లి స్వామి,ఎండోమెంట్ డైరెక్టర్ బాల కృష్ణ,మాజీ పాల సంఘం చైర్మెన్ రాచమల్ల శంకరయ్య,పాల సంఘం చైర్మెన్ పరమేష్,ఈతాప రాములు,పోలేపల్లి వీరాస్వామి,బొక్క బుచ్చిరెడ్డి మరియు 200మంది బీఆరెస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించారు.

VijayaKumar

Apr 10 2024, 18:41

ఎంపీపీ పూస బాల నరసింహ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన బందెల క్రిస్టఫర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు


యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాల నగరం అభివృద్ధి ప్రదాత, ప్రజాసేవ చేయాలని లక్ష్యంతో ముందడుగు వేసి ఇంద్రపాల నగరం గ్రామ సర్పంచిగా గత ఐదు సంవత్సరాలుగా పలు అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి, గ్రామాన్ని ప్రగతి పథంలో లో నడిపించి, రామన్నపేట ఎంపీపీ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రజా నాయకులు పూస బాల నరసింహ కి ఇంద్ర పాలనగరం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బందెల క్రిస్టఫర్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. ఇంద్రపాల నగరం గ్రామానికి వీరి చేసిన సేవలు సేవలు మరువలేమని అన్నారు

VijayaKumar

Apr 10 2024, 16:38

ఆడపిల్లలకు రక్షణ కరువు ...కీచక ఉపాధ్యాయుడిని ఉద్యోగం నుంచి తొలగించాలి :ఏఐఎస్ఎఫ్


నేటి సమాజంలో ఆడపిల్లలుగా పుట్టడమే పాపం అయిపోయిందని అమ్మాయిలకు ఎక్కడ రక్షణ లేకుండా పోయిందని, రోజురోజుకు యాదాద్రి భువనగిరి జిల్లాలో అమ్మాయిలపై అఘాయిత్యాలు, కామాంధుల ఆగడాలు పెరుగుతున్నాయని మోత్కూర్ మండల కేంద్రంలో ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ అన్నారు 

దానికి నిదర్శనమే గుండాల మండల కేంద్రంలో జరిగిన సంఘటన 

 విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే వక్ర బుద్ధితో గత కొంతకాలంగా చాక్లెట్లు ఆశ చూపి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన తీరు సభ్య సమాజాన్ని కలిసి వేసిందని అన్నారు కామాంధుడైన అండెం మాధవరెడ్డి పైన పోక్సో కేసు నమోదు చేసి విధుల నుండి తొలగించాలని డీఈఓ,ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ( ఎ ఐ ఎస్ ఎఫ్)గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం 

నిత్యం విద్య సంస్థల్లో అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఇకమీదట ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నత స్థాయి అధికారులు పర్యవేక్షించి విద్యార్థులతో మాట్లాడి వారి యొక్క సమస్యలు తెలుసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం